Posted on 2026-08-01 19:13:32
₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై సీసీఎస్ (CCS) సిబ్బంది మరియు సుజాతనగర్ పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి ₹52,100 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం (సీజ్) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన నిందితుల వివరాలు..
నునావత్ సంతోష్,భూక్య బిక్కులాల్ ,నున్సావత్ అశోక్ కుమార్,చల్ల రాజు ,భూక్య వీరన్న ,ఇస్లావత్ ప్రవీణ్ కుమార్
పరారీలో ఉన్న నిందితులు
కున్సోత్ వంశీ,భూక్య ప్రవీణ్ ,పల్లపు చంటి ,బానోత్ గోపి ,ధరావత్ రాజ్ కుమార్ చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >