Posted on 2026-08-01 16:59:26
డైలీ భారత్, సిరిసిల్ల: ఉద్యోగ ఉపాధ్యాయుల సుదీర్ఘ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతా నగర్ హైస్కూల్లో జరిగిన జిల్లా TPTF కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుమాల రమానాద్ రెడ్డి, విక్కుర్తి అంజయ్య అధ్యక్షత వహించారు.
సమావేశంలో చేసిన ప్రధాన డిమాండ్లు:
G.O 25 ను వెంటనే రద్దు చేయాలి. ఈ జీవో వల్ల అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని, ప్రతి తరగతికి ఒక టీచర్ను నియమించాలని అన్నారు.
PRC నివేదికను వెంటనే ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న పే రివిజన్ కమిషన్ను ఆలస్యం చేయడం సరికాదని తెలిపారు.
పెండింగ్లో ఉన్న 6 DA లను వెంటనే విడుదల చేయాలి.
CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం OPS ను అమలు చేయాలి.
EHS హెల్త్ కార్డుల అమలులో జాప్యం తగ్గించాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించి ఉద్యోగ ఉపాధ్యాయులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని కోరారు.
విద్యారంగంపై స్పందిస్తూ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే శిక్షణల పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలల నుండి దూరం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం తగ్గుతుందని అన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖపై సమీక్షలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అలాగే 190 G.O అమలు చేయాలని, 317 G.O బాధితులకు న్యాయం చేయాలని, BED అర్హత ఉన్న SGT లకు LFL మరియు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, మైలారం తిరుపతి, కృష్ణ చైతన్య, రామచంద్రం తో పాటు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >