| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

బాన్సువాడ  పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరం

నైట్ పెట్రోలింగ్ ముమ్మరం.. అప్రమత్తతే నేరాల నివారణకు ఆయుధం

ప్రజల విశ్వాసమే లక్ష్యంగా పనిచేయాలి – పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం

జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ శుక్రవారం నాడు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది హాజరు (రోల్ కాల్), వారి క్రమశిక్షణ మరియు సమయపాలనను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాను చెబుతున్న సూచనలు సిబ్బందికి ఏ మేరకు అర్థమయ్యాయో కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు మరియు ఫిర్యాదుదారుల పట్ల మానవీయ కోణంలో గౌరవంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని ఎస్పీ కోరారు. ప్రజల ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు. చివరగా, జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో నిరంతర పెట్రోలింగ్, గస్తీ పెంచాలని, అనుమానితులపై నిశిత నిఘా ఉంచాలని బాన్సువాడ ఎస్.హెచ్.ఓ ని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడరాదని, ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పి విఠల్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ శ్రీధర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Next పీజీ ఫలితాలు విడుదల
ADVERTISEMENT