Posted on 2026-04-10 04:02:13
డైలీ భారత్, కరీంనగర్: పోలీస్ శాఖలో కలకలం రేపే భారీ నిధుల మళ్లింపు ఉదంతం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సిబ్బంది పేరుతో ఏకంగా రూ. 1.40 కోట్లను డ్రా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వైనాన్ని ఉన్నతాధికారులు బట్టబయలు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఒక పోలీసు ఉద్యోగిపై క్రిమినల్ కేసు నమోదైంది.
మరణించిన వారి పేర్లతో మాయాజాలం
టాస్క్ ఫోర్స్ ఏసీపీ జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక ఉద్యోగి, చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను (Employee IDs) పావుగా వాడుకున్నాడు. IFMIS పోర్టల్లో ఆ ఐడీల స్థానంలో ఇతరుల పేర్లను చేర్చి, నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఈ ఖాతాలకు తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించి, 2022 నుండి 2026 వరకు ఎవరికీ అనుమానం రాకుండా జీతాల సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.
కుంభకోణం విలువ: రూ. 1,40,18,308/-
సుమారు నాలుగు ఏళ్ల కాలంలో నిందితుడు రూ. 1,40,18,308/- మేర ప్రభుత్వ ధనాన్ని కాజేసినట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమంగా సంపాదించిన ఈ సొమ్ముతో నిందితుడు పర్సనల్ లోన్లు పొందడమే కాకుండా, విలాసాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది.
కఠిన చర్యలకు సీపీ ఆదేశం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. సీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది.
"ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో అంతర్గత విచారణ కొనసాగుతోంది," అని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు వెల్లడించారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >