Posted on 2026-04-10 07:32:13
డైలీ భారత్, కరీంనగర్: పోలీస్ శాఖలో కలకలం రేపే భారీ నిధుల మళ్లింపు ఉదంతం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సిబ్బంది పేరుతో ఏకంగా రూ. 1.40 కోట్లను డ్రా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వైనాన్ని ఉన్నతాధికారులు బట్టబయలు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఒక పోలీసు ఉద్యోగిపై క్రిమినల్ కేసు నమోదైంది.
మరణించిన వారి పేర్లతో మాయాజాలం
టాస్క్ ఫోర్స్ ఏసీపీ జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక ఉద్యోగి, చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను (Employee IDs) పావుగా వాడుకున్నాడు. IFMIS పోర్టల్లో ఆ ఐడీల స్థానంలో ఇతరుల పేర్లను చేర్చి, నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఈ ఖాతాలకు తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించి, 2022 నుండి 2026 వరకు ఎవరికీ అనుమానం రాకుండా జీతాల సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.
కుంభకోణం విలువ: రూ. 1,40,18,308/-
సుమారు నాలుగు ఏళ్ల కాలంలో నిందితుడు రూ. 1,40,18,308/- మేర ప్రభుత్వ ధనాన్ని కాజేసినట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమంగా సంపాదించిన ఈ సొమ్ముతో నిందితుడు పర్సనల్ లోన్లు పొందడమే కాకుండా, విలాసాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది.
కఠిన చర్యలకు సీపీ ఆదేశం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. సీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది.
"ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో అంతర్గత విచారణ కొనసాగుతోంది," అని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు వెల్లడించారు
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >
బీబీపేట్ మండలం లోని మహేశ్వరి రైస్ మిల్లో ధాన్యం దిగుబడి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-05-29 12:17:49
Readmore >