Posted on 2026-04-08 17:14:22
డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపిఎస్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం కొయ్యూరు పోలీస్లు అక్రమ గుడుంబా తయారీపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా మల్హర్ మండలం కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య (40) అక్రమంగా గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, సుమారు 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.
అలాగే అదే గ్రామానికి చెందిన చీర్ల రాజేశ్వరి (50) గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడింది. ఆమె వద్ద నుండి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, సుమారు 50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.
ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ గుడుంబా తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
కొయ్యూరు ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >