| Daily భారత్
Logo




ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

News

Posted on 2026-07-31 13:26:11

Share: Share


ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి గెలిచి తిరిగి వస్తారని మనమందరం ఎదురుచూశామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త బాధాకరమన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి అగ్రభాగాన నిలిచి పోరాడారని,పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, నర్సంపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేశారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

ఆయన అకాల మృతి పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. పెద్ది తనకు ఆప్త మిత్రుడు అని,సన్నిహితులని,ఆయన మరణం పట్ల ఎంపీ రవిచంద్ర తీవ్ర సంతాపం ప్రకటించారు.

సుదర్శన్  రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పెద్ది ఇక లేరనే విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఎంపీ రవిచంద్ర కోరుకున్నారు.

Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >