Posted on 2026-04-07 11:09:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఔట్పేషెంట్ విభాగంలో రోగులతో మాట్లాడి సేవలు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళల వార్డు సహా పేషెంట్ వార్డులను పరిశీలించి రోగుల సంరక్షణపై ఆరా తీశారు.
ల్యాబ్ను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, రిజిస్టర్ను పరిశీలించారు. మందుల గది, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేడియాలజీ, స్కానింగ్, ఎక్స్-రే విభాగాల్లో ఆలస్యాలపై ఆరా తీసి, టెక్నీషియన్ల కొరత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు అందించకపోవడాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం
Posted On 2026-04-07 12:50:09
Readmore >
హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-04-07 12:48:44
Readmore >
కామారెడ్డి లో జరుగుతున్న KPL వేదికగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-04-07 12:45:48
Readmore >
ప్రతినెలా 100కు పైగా ఫోన్ల రికవరీ... ఈ ఏడాది ఇప్పటివరకు ₹61 లక్షల విలువైన 384 ఫోన్లు స్వాధీనం
Posted On 2026-04-07 12:44:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం
Posted On 2026-04-07 12:36:49
Readmore >
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-07 11:09:21
Readmore >
అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం
Posted On 2026-04-07 10:52:38
Readmore >
గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు
Posted On 2026-04-07 10:51:04
Readmore >