డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు రక్షణ చట్టం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన గంగల రవీందర్ ముదిరాజ్ గారిని పట్టణానికి చెందిన యువకులు సోమవారం అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకు సమాచారం హక్కు చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జె వేణు ముదిరాజ్, బత్తుల యాదగిరి,చక్రపాణి, ప్రశాంత్, రాజు, వేణు, బోయిన స్వామి పాల్గొన్నారు.
News
గంగల రవీందర్ ముదిరాజ్ ఘనంగా సన్మానం