Posted on 2026-04-05 13:29:40
ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందిన సీఎండీ.
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని టీజీఎన్పీడీసియల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎండీకి అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో వేద పండితులు వేదోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేయగా, సీఎండీ వినయంతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి (ఏఈఓ) జి. శ్రవణ్ కుమార్ స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఈ పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా ప ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం వేడుకున్నట్లు సీఎండీ తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >
మద్దికుంటలో ప్యాడ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ మనిషా రామస్వామి
Posted On 2026-04-06 09:12:35
Readmore >
రాజన్న సిరిసిల్ల : ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-04-06 08:25:21
Readmore >
టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
Posted On 2026-04-05 16:23:20
Readmore >