Posted on 2026-04-05 13:28:22
పాడి పంట రైతుల ఆవేదన
జెసిబి సహాయంతో మట్టి తరలింపు
ఎదురు మాట్లాడితే బెదిరింపులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో వాగులో ఉన్న అన్ని రేవుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జెసిబిలతో వాగులోని ఇసుక, మట్టిని భారీగా తవ్వుతూ అక్రమ దందా గా వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతోంది. వాగు సహజ స్వరూపం పూర్తిగా దెబ్బతిని భూగర్భ జలాలు తగ్గిపోతుండగా వర్షాకాలంలో వరదల సమయంలో తీరం కూలిపోవడం వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. వాగు మట్టిని విచక్షణారహితంగా తొలగించడం వల్ల నేల బలహీనమై రైతుల పొలాలు నష్టపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోవడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ట్రాక్టర్ యజమానులు సిండికేట్గా ఏర్పడి లక్షల్లో అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ ఎదురు మాట్లాడిన రైతులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. తెల్లవారుజామున ట్రాక్టర్ల రాకపోకలతో శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలకు నిద్ర లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, రోడ్లు దెబ్బతింటూ దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ట్రాక్టర్ శబ్దాల కారణంగా పాడి పంటలు పశువులు దెబ్బతింటున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాగులో ప్రమాదకర గుంతలు ఏర్పడి పశువులు పడి మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు, గతంలో ఇదే వాగులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ తవ్వకాలు ఆగకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మరియు సుజాత నగర్ మండల అధికారులు మొద్దు నిద్ర విడనాడి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుని వాగును, రైతుల జీవనోపాధిని రక్షించాలని సుజాతనగర్ మండల గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >