Posted on 2026-04-05 06:55:57
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు,జిల్లా రాష్ట్ర కమిటీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా TSUTF జిల్లా ఆఫీస్ బేరర్ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పాకాల శంకర్ గౌడ్ ప్రకటించారు.గత దశాబ్ద కాలంగా సంఘ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని,దాచురి రామిరెడ్డి,నాగటి నారాయణ లాంటి మహానాయకులను స్పూర్తిగా తీసుకొని సంఘ అభ్యున్నతికి, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని అన్నారు.కాని నేటి రాష్ట్ర,జిల్లా నాయకుల్లో సంఘ నిర్మాణం,నియమాల కంటే వ్యక్తిగత స్వార్థం,పదవీ కాంక్ష, కుల రాజకీయాలు పెరిగాయని,ఉపాధ్యాయుల సమస్యలను, సంక్షేమాన్ని పక్కన పెట్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సంఘం పనిచేస్తూ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు.తన భవిష్యత్ కార్యాచరణ ను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.గత దశాబ్ద కాలంగా చేసిన ఉద్యమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >