Posted on 2026-04-02 07:41:02
డైలీ భారత్, కల్లూరు: కల్లూరు డివిజన్, ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన నలుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
ఏన్కూర్ గ్రామీణ బ్యాంకు శాఖా నిర్వాహకులు కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏన్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విచారణలో భాగంగా 2024 ఏడాది లో బ్యాంకులో బంగారు ఆభరణాల విలువ నిర్ధారించే అధికారి (Gold Appraiser) శ్రీపాది సతీష్ (A1), శ్రీపాది మౌనిక (A2) (పరారీ) , రామచంద్రోజు జయమ్మ (A3),రామచంద్రోజు నరేష్ (A4)లు కుమ్మక్కై సుమారు 242.25 గ్రాముల బరువున్న నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా తాకట్టు పెట్టి (రూ. 9,53,000/-) తొమ్మిది లక్షల యాభై మూడు వేల విలువైన బంగారు రుణాలను పొందినట్లు పేర్కొన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఇటీవల ఆ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా (NPAs) మారాయని, దీంతో బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియను చేపట్టారని తెలిపారు. ఆసమయంలో తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని గుర్తించారని తెలిపారు. ఈనేపథ్యంలో నిందుతులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్ లను అరెస్టు చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. A2 శ్రీపాది మౌనిక పరారీ ఉన్నట్లు తెలిపారు.
ఎవరైనా ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పని ఏసీపీ అన్నారు.
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >