Posted on 2026-04-02 03:08:24
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువై, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో, విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు సెస్ ఎండీ బిక్షపతి తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు, వినియోగదారుల పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి సేవలను ఇప్పటి నుంచి ఏ మీసేవ కేంద్రంలో అయినా పొందవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు తమ సమీప మీ సేవ కేంద్రంలోనే సమస్త విద్యుత్ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు .
మీ సేవ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు...
కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు : గృహ, వ్యాపార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పుడు ప్రతి మీ సేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ నుండి మంజూరు వరకు మొత్తం ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది.
వినియోగదారు పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు : మీ సేవ కేంద్రాల్లో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు.
ఇతర సేవలు : లోడ్ మార్పు, తాత్కాలిక కనెక్షన్, కనెక్షన్ తొలగింపు, మొదలైన అన్ని సేవలు కూడా మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఇప్పటి వరకు విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి ఇవ్వాల్సిన దరఖాస్తులను, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న ఏ మీసేవ కేంద్రంలో అయినా ఇవ్వొచ్చు అన్నారు. వినియోగదారుల సౌకర్యమే మా ప్రథమ లక్ష్యం" అని, పారదర్శకంగా నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >