Posted on 2026-04-01 19:10:33
మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో పొద్దుతిరుగుడు పంట 1,700 ఎకరాల్లో సాగు చేశారని వెల్లడించారు. ఈ పంట కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కొనుగోలు కోసం కావాల్సిన సామాగ్రి, వేయింగ్ యంత్రాలు అన్ని ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్ పొద్దుతిరుగుడుకు రూ.7721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. రైతులు దీర్ఘకాలం పాటు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. దీంతో అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని తెలిపారు. సన్న వడ్లు పండించేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మద్దతు ధర, బోనస్ ఇతర లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్ ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >