Posted on 2026-04-01 10:11:18
పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
దమ్మపేట గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్ అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. వడ్డించిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా వండకపోవడం, రుచి లోపించడం గమనించి విద్యార్థులకు పోషక విలువలతో ఆహారం అందించాలని ఆదేశించారు.
చిన్న పాఠశాలల్లో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తున్నప్పుడు ఇక్కడ లోపాలు ఉండటం తగదని పేర్కొని, వెంటనే సరిచేయాలని సూచించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాన్ని పరిశీలించి, ట్యాపులు లేక నీరు వృథా అవుతున్న అంశంపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డు సభ్యురాలు దుర్గ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Education #MiddayMeal #Telangana
FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు
Posted On 2026-04-01 07:56:39
Readmore >
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం
Posted On 2026-04-01 05:45:44
Readmore >
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >