Posted on 2026-04-01 09:56:39
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నేషనల్ హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు ఒక ముఖ్యమైన వార్త. మీరు మీ కారుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) వాడుతున్నారా? అయితే ఇకపై మీ జేబుకు కొంచెం అదనపు భారం పడక తప్పదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టోల్ టాక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పాస్లను వాడుతున్న లక్షలాది మంది ప్రైవేట్ వాహన యజమానులపై ఈ ప్రభావం పడనుంది.
ప్రస్తుతం ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర 3000 రూపాయలుగా ఉంది. కానీ, 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీని ధర 3,075 రూపాయలకు పెరగనుంది. అంటే నేరుగా 75 రూపాయల ధర పెరిగిందన్నమాట. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2025 ఆగస్టు 15న ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రైవేట్ వాహన యజమానులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం దాదాపు 56 లక్షల వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలపై ఈ పాస్ ద్వారా టోల్ చెల్లింపులు చేస్తున్నాయి.
అయితే కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి, వాహనదారులకు ఇప్పటికీ కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ పాస్ రినవల్ దగ్గరకు వచ్చినా లేదా మీరు కొత్తగా పాస్ తీసుకోవాలని అనుకుంటున్నా.. మార్చి 31వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు పాత ధరకే అంటే 3,000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక్కో పాస్పై మీరు నేరుగా 75 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.ఈ పాస్ను మీరు ఇంటి నుండే ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ లేదా ‘రాజమార్గ యాత్ర’ యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. వెబ్సైట్ ద్వారా తీసుకోవాలనుకుంటే.. ముందుగా ఎన్హెచ్ఏఐ సైట్లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూలో ఉన్న ‘ ఫస్ట్ట్యాగ్ ఆన్యూల్ పాస్’ ఆప్షన్ను ఎంచుకుని, మీ వాహనం, ఫాస్టాగ్ వివరాలను నమోదు చేయాలి. మీ అర్హతను ధృవీకరించిన తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేస్తే సరిపోతుంది.యాప్ ద్వారా అయితే, మీ స్మార్ట్ఫోన్లో రాజమార్గ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. మీ ఫాస్టాగ్ ఖాతాను యాప్కు లింక్ చేసిన తర్వాత, యాన్యువల్ పాస్ సెక్షన్లోకి వెళ్లి మీ వాహనాన్ని ఎంచుకుని ఫీజు చెల్లించాలి. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >