Posted on 2026-03-28 14:44:35
ప్రభుత్వం తరుపున ప్రత్యేక నిధులు కేటాయించాలి
గ్రామాలలో కొలిచే పెద్దమ్మ తల్లి కొలుపులకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలి
నాయకపోడు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి
మా గిరిజన దేవతల కొలుపులకు ఆదరణ కరువు...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ నాయుకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నాయకపోడు కులస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలుస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి తిరుణాలకు ప్రభుత్వం మరియు ఐటిడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని,వేల సంవత్సరాల నుంచి మా కులస్తులు పెద్దమ్మ తల్లి కొలుపులు కొలుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రానున్న రోజుల్లో మా గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి పెద్దమ్మతల్లి కొలుపులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >