Posted on 2026-03-28 16:19:18
డైలీ భారత్, కోరుట్ల: సాధారణంగా కరెంటు బుల్లు కట్టకపోతే, బకాయిలు ఎక్కువైతే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తూ ఉంటారు. ఏవైనా పన్నులు కట్టాల్సి ఉంటే పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి క్లియరెన్సులు నిలిచిపోతుంటాయి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఇంటిపన్ను కట్టకపోతే అధికారులు సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. మొదట మున్సిపల్ నుండి వినియోగించుకుంటున్న సేవలను నిలిపివేస్తామని అప్పటికి ఇంటిపన్ను చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో ఇంటి పన్ను వసూళ్ల కోసం అధికారులు అవసంభిస్తున్న ఈ కొత్త పద్ధతి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ శాఖకు మాత్రమే ఉంటుంది.
అయితే మున్సిపల్ పన్ను బకాయిల కోసం అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇంటి పన్ను వసూలు చేసిన మున్సిపల్ అధికారులు 100 శాతం ఇంటి పన్ను వసూలు కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు చెప్పారు. కాగా, గృహలక్ష్మి పథకం అమలవుతున్న తమ ఇండ్ల కరెంట్ కట్ చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొండి బాకీ వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో ఆ ఇంటి విద్యుత్, వాటర్ కలెక్షన్లు కట్ చేస్తున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. కరెంట్ కట్ చేసే పరిస్థితి రాకుండా అందరు సహకరించి ఇంటి పన్నులను చెల్లించాలని పట్టణ ప్రజలను కమిషనర్ కోరారు
మున్సిపల్ కమిషనర్
బాధితురాలు
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >