Posted on 2026-03-20 20:10:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ఏపీ లోని ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. వీరిలో ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు, భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతు అయిన వారి కోసం పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగారు. వీరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. ఒకరిని కాపాడబోయి.. మరొకరు ఇలా నీటిలో మునిగిపోయారు.
ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోక తేజ, నవదీప్ ఉయ్యూరు ప్రాంతానికి చెందినవారు. పాశం సతీష్ కుమార్ మదనపల్లి, చారు గుండ్ల శ్రీకర్, పొడిచేటి అభిరామ్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇవాళ్లంతా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఇప్పటి వరకూ శ్రీకర్, నవదీప్ ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >