| Daily భారత్
Logo




గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు

News

Posted on 2026-03-20 14:40:20

Share: Share


గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ఏపీ లోని ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. వీరిలో ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు, భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు.

గల్లంతు అయిన వారి కోసం పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగారు. వీరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. ఒకరిని కాపాడబోయి.. మరొకరు ఇలా నీటిలో మునిగిపోయారు.

ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోక తేజ, నవదీప్ ఉయ్యూరు ప్రాంతానికి చెందినవారు. పాశం సతీష్ కుమార్ మదనపల్లి, చారు గుండ్ల శ్రీకర్, పొడిచేటి అభిరామ్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇవాళ్లంతా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఇప్పటి వరకూ శ్రీకర్, నవదీప్ ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Posted On 2026-04-01 17:10:33

Readmore >
Image 1

మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు!

Posted On 2026-04-01 15:48:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌ అధికారులు

Posted On 2026-04-01 15:43:24

Readmore >
Image 1

ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-01 14:26:38

Readmore >
Image 1

కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు

Posted On 2026-04-01 14:24:00

Readmore >
Image 1

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి

Posted On 2026-04-01 14:23:00

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ

Posted On 2026-04-01 14:03:43

Readmore >
Image 1

రక్తదాన శిబిరం తో ఆదర్శంగా నిలిచిన ధర్మారావుపేట గ్రామం

Posted On 2026-04-01 13:22:44

Readmore >
Image 1

ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-01 13:21:20

Readmore >
Image 1

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-01 12:55:54

Readmore >