Posted on 2026-03-20 19:36:56
విద్యారంగానికి బడ్జెట్ లో కనీసం 15% కేటాయింపులు జరపాలి
పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ
డైలీ భారత్, కామారెడ్డి: 2026-27ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు 26,674 కోట్లు,గత సంవత్సరం కంటే అదనంగా 3566 కోట్లు అదనంగా విద్యకు కేటాయించినప్పటికీ, విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా ప్రస్తుత బడ్జెట్లో విద్యకు కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించడం సరైనది కాదు. అదేవిధంగా ఈ బడ్జెట్లో పిఆర్సి ప్రస్తావన ఉంటుంది, దానికి నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది
ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు నెలలలోపు పిఆర్సిని అమలు చేస్తామని చెప్పి 27 నెలలు అవుతున్నా గానీ, పిఆర్సికి సంబంధించిన కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో కనపడకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశకు గురి చేసింది
వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేయడాన్నీ స్వాగతిస్తున్నాం.ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1056 కోట్ల కేటాయింపును స్వాగతిస్తూ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు,పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డుల పై నగదురహిత వైద్యము అందించాలి
కొత్త పేర్లతో పాఠశాలను స్థాపించకుండా ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేసి నిధులు కేటాయించినట్టయితే విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రస్తుత బడ్జెట్లో కనీసం 15% తగ్గకుండా నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పాటుపడలని కోరుతున్నాం.
*అంబీర్ మనోహర్ రావు, జిల్లా అధ్యక్షులు, జనపాల లక్ష్మీరాజం,జిల్లా ప్రధాన కార్యదర్శి, పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >