Posted on 2026-03-20 10:20:56
ఐస్క్రీం బండ్లకు గూడూరులో నో-ఎంట్రీ… అతిగా తినే పిల్లల ఆరోగ్యమే కారణం
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: యువత, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం గూడూరు గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గూడూరులోకి ఐస్క్రీం బండ్లు రాకుండా నిషేధం విధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు; ఉల్లంఘిస్తే ₹5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.గ్రామ పెద్దలు ముందుగా అక్రమ మద్యం బెల్ట్ దుకాణాన్ని మూసివేయగా, తర్వాత ఐస్క్రీం బండ్లపై దృష్టి సారించారు. కొందరు విక్రేతలు బండ్లలో మద్యం మిక్స్ చేసి అమ్మిన ఘటనలు, అలాగే సొంతంగా తయారుచేసిన ఐస్క్రీంలో కల్తీ పదార్థాలపై అనుమానాలు ఈ చర్యకు దారితీశాయి. “పిల్లలు అతిగా తిని దంత, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఏ రసాయనాలు కలుస్తున్నాయో తెలియదు” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, గ్రామం మొత్తం ఈ నిషేధాన్ని మూడు రోజుల క్రితం అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >