| Daily భారత్
Logo




టెన్త్ పరీక్షల్లో కఠిన నిబంధనలు… ‘జీరో మొబైల్ జోన్’ అమలు

News

Posted on 2026-03-20 10:14:04

Share: Share


టెన్త్ పరీక్షల్లో కఠిన నిబంధనలు… ‘జీరో మొబైల్ జోన్’ అమలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తూ ‘జీరో మొబైల్ జోన్’ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు కేవలం విద్యార్థులకే కాకుండా ఇన్విజిలేటర్లు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్స్ తీసుకెళ్లరాదని ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రం ఫోన్ ద్వారా బయటకు రావడం తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఈ కొత్త నియమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ విధుల్లో చేరే ముందు తమ వద్ద ఎలాంటి ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డే-వైజ్ డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది.

సంతకం చేసినప్పటికీ సిబ్బంది వద్ద ఫోన్లు ఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తిస్తే, దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోన్లను వినియోగిస్తే 1997 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదనంగా సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.

సిబ్బంది చేసిన తప్పులకు చీఫ్ సూపరింటెండెంట్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై శుక్రవారం ఎగ్జామినేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Image 1

నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

Posted On 2026-04-02 07:41:02

Readmore >
Image 1

జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్

Posted On 2026-04-02 07:30:03

Readmore >
Image 1

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

Posted On 2026-04-02 06:54:11

Readmore >
Image 1

జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం

Posted On 2026-04-02 06:52:45

Readmore >
Image 1

గ్రామసభలను ప్రజలు వినియోగించుకోవాలి

Posted On 2026-04-02 05:45:28

Readmore >
Image 1

అక్రమ నిర్మాణము... నిలిపివేతకు కోర్టు స్టే ఆర్డర్

Posted On 2026-04-02 05:01:24

Readmore >
Image 1

సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..

Posted On 2026-04-02 03:19:01

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు

Posted On 2026-04-02 03:17:46

Readmore >
Image 1

హనుమజ్జయంతి ..

Posted On 2026-04-02 03:12:07

Readmore >
Image 1

మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి

Posted On 2026-04-02 03:08:24

Readmore >