Posted on 2026-03-20 15:44:04
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తూ ‘జీరో మొబైల్ జోన్’ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు కేవలం విద్యార్థులకే కాకుండా ఇన్విజిలేటర్లు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్స్ తీసుకెళ్లరాదని ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రం ఫోన్ ద్వారా బయటకు రావడం తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఈ కొత్త నియమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ విధుల్లో చేరే ముందు తమ వద్ద ఎలాంటి ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డే-వైజ్ డ్యూటీ రిజిస్టర్లో సంతకం చేయాల్సి ఉంటుంది.
సంతకం చేసినప్పటికీ సిబ్బంది వద్ద ఫోన్లు ఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తిస్తే, దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోన్లను వినియోగిస్తే 1997 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదనంగా సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
సిబ్బంది చేసిన తప్పులకు చీఫ్ సూపరింటెండెంట్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై శుక్రవారం ఎగ్జామినేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >