Posted on 2026-03-18 13:13:40
గంభీరావుపేట సీహెచ్ సీని పరిశీలించిన కలెక్టర్.
డైలీ భారత్, గంభీరావుపేట : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) లో కలెక్టర్ బుధవారం పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్ రూమ్, వ్యాక్సినేషన్ గది, ఎక్స్ రే గది, యునాని హాస్పిటల్, ఆసుపత్రి ఆవరణ అంతా పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీఓకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మరమ్మత్తు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, జిల్లా వైద్య అధికారి రజిత, డీసీ హెచ్ ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, డాక్టర్ సృజన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >