Posted on 2026-03-18 12:58:43
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు , పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం, తదితర వాటి పై ఆరా తీశారు.
ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >