Posted on 2026-03-18 13:58:43
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు , పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం, తదితర వాటి పై ఆరా తీశారు.
ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >