Posted on 2026-03-18 07:51:07
డైలీ భారత్, హైదరాబాద్:చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది వేధింపులకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
శ్రీనివాస్ నగర్కు చెందిన రమాదేవి, కోటేశ్వరరావు దంపతుల కూతురు జెనీమా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఇటీవల పరిచయమైన జగదీష్ అనే యువకుడు జెనీమాను తరచూ వేధించేవాడని తల్లి రమాదేవి తెలిపారు.
ఈ వేధింపులు ఆగకపోవడంతో,ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు.
దాడి అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన జెనీమా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు.తలుపులు తెరిచి చూడగా, ఆమె ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో కనిపించింది.
వెంటనే కిందకు దించి సీపీఆర్ చేయగా అప్పటికీ ప్రాణాలు పోయినట్లు డాక్టర్ తెలిపారు.
జెనీమాను మృతికి కారణమైన జగదీష్ ను వదిలి పెట్టొద్దు అంటున్న కుటుంబ సభ్యులు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >