Posted on 2026-03-18 06:05:38
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తండ్రి మృతి చెందిన బాధలో ఉన్న విధి ముందు నిలబడాల్సిన పరిస్థితి ఓ చిన్నారి జీవితంలో కనిపించింది. బిజెపి నాయకుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా అదే సమయంలో ఆయన చిన్న కుమారుడు అక్షిత్ రెడ్డి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇవాళ హిందీ పరీక్ష ఉండడంతో… ఇంట్లో తండ్రి మృతి దుఃఖం, కుటుంబ సభ్యుల రోదనలు మధ్యే… కంటినిండా బాధతో పరీక్ష రాయడానికి బయలుదేరాడు అక్షిత్. ఈ విషయం తెలుసుకున్న అతను చదువుతున్న విద్యాసంస్థ వ్యవస్థాపకుడు లతీఫ్… కుటుంబ సభ్యులను ఓదార్చి, పరీక్ష రాయించడం అవసరమని నచ్చజెప్పి సెంటర్కు తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో తన సోదరితో మాట్లాడుతూనే… కంటతడి పెట్టిన అక్షిత్ పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >