Posted on 2026-03-14 21:32:57
(15 ఆదివారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో దీక్ష
కాంట్రాక్టర్లకు 70 వేల కోట్లు ఇచ్చి,ఫీజుల కోసం ఏడు వేల కోట్లు ఇవ్వరా ?
నీల నాగరాజు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ
రెండు సంవత్సరాల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారీస్తే ప్రభుత్వ పీఠాలు కదిలిస్థాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరికి ఎంత నిధులు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు
డైలీ భారత్, కామారెడ్డి: ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని,ఈ బడ్జెట్ లో ఫీజులకు పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ఫీజు పోరు దీక్ష చేపడుతున్నామని అన్నారు.
అధికారంలోకి రాగానే ఫీజులకు బకాయిలను విడుదల చేస్తామని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామని, ఐదు లక్షల రూపాయలతో ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డులను అందజేస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.
గత రెండు సంవత్సరాల కాలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్రమంతా విద్యార్థులంతా ఉద్యమిస్తుంటే,రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని అబద్ధపు మాటలు చెబుతుందన్నారు,ఏడు వేల కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా బడా కాంట్రాక్టర్లకు 70 వేల కోట్ల రూపాయలను ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు
గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పు చేశారని, తెలంగాణలోని ప్రతి మనిషికి 1,76 వేల రూపాయలు అప్పు రుద్దారని,అప్పు బడుగులపై రుద్ది, సంపద మాత్రం బడా కాంట్రాక్టర్లకు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం ఇంకొక వైపు 5 వేల కోట్ల తో గాంధీ విగ్రహం పెడుతున్నారని, 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఒకవైపు విద్యార్థి లోకమంతా డిమాండ్ చేస్తూ ఉంటే, కాలేజీ అమ్మాయిలకు ఈ స్కూటి లను ఇస్తామని, కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా దారుణం అన్నారు. విద్యార్థులకు కావాల్సింది స్కూటీలు ఎంగిలి మెతుకులు కాదని,ఆత్మగౌరవంతో చదువుకోవడానికి ఫీజుల రియంబర్స్మెంట్ లు కావాలని ఆయన డిమాండ్ చేశారు
ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని,నాడు కాసోజు శ్రీకాంతాచారి నుండి మొదలుకొని సిరిపురం యాదయ్య వరకు విద్యార్థి అమరులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని,వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను హరిగోస పెడుతుందని,మళ్లీ విద్యార్థుల చావులకు కారణం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని,వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో పదివేల కోట్లు ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చ్ ఈనెల 15వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఫీజు పోరు దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాయి విగ్నేష్,రాజ్ కుమార్,మనిరాజ్,సుమన్,గణేష్,శివ,నిఖిల్,సందీప్,వరుణ్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >