Posted on 2026-03-14 22:05:48
డైలీ భారత్, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఈ రోజు జరిగింది తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాం ప్రసాద్ రావు కి, స్టేజీపై ఉన్న పెద్దలందరికీ,
ఈ సభకు విచ్చేసిన సంఘ సభ్యులందరికీ,
మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ
నా పేరు మంజుల పత్తిపాటి.
నేను గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను, ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి — నేను ఒక కరణం ముద్దుబిడ్డను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం,
ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం సాధారణ సమావేశం కాదు.
ఇది మన చరిత్రను గుర్తు చేసే సమావేశం అని అన్నారు.
ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగులు వెలిగించిన చేతులు మనవి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది.
కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి?
గ్రామాల్లో మనకు ఉన్న పరపతి తగ్గిపోయింది.
కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాం అని అన్నారు.
ఒకప్పుడు పులిలా జీవించిన మనం,
ఇప్పుడు పిల్లిలా బ్రతుకుతున్న పరిస్థితి వచ్చింది.
దానికి ప్రధాన కారణం ఏమిటంటే
మన మధ్య ఐక్యత లేకపోవడం.
మనలో చాలా మందిలో ఒక భావన పెరిగింది —
“నేను లాభపడకపోయినా పర్వాలేదు,
నా పక్కవాడు లాభపడకూడదు” అనే భావన.
ఈ భావనతో మన సమాజం ముందుకు వెళ్లదు.
ఒకరి బాధ అందరి బాధ కావాలి.
ఒకరి విజయం అందరి విజయం కావాలి.
అప్పుడే మన సమాజం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.
ఈ సమావేశం కేవలం మన కోసం కాదు.మన తర్వాతి తరం మనలాగే కష్టాలు పడకూడదనే సంకల్పంతో జరుగుతున్న సమావేశం అని నేను భావిస్తున్నాను. మనము విడిపోయితే మన చరిత్ర మసకబారుతుంది. మనము కలిస్తే మన చరిత్ర మళ్లీ ప్రకాశిస్తుంది.
ఒక మహిళగా నేను చెప్పేది ఒక్కటే
ఇంటిని నిలబెట్టేది మహిళ అయితే,
మన సమాజాన్ని నిలబెట్టేది ఐక్యత.
అందుకే మన చేతులు మళ్లీ కలవాలి.
మన స్వరం మళ్లీ గర్జించాలి అని పిలుపునిచ్చారు.
మన మధ్య దూరం పెరుగుతుందని, మన గౌరవం మెల్లగా తగ్గిపోతుందని గ్రహించిన మన అందరి ప్రియమైన బంధువు బండారు రాం ప్రసాద్ రావు అన్న, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం.
వారి కృషి వల్లనే ఈ రోజు మనం అందరం ఒకే వేదికపై కలిసే అవకాశం వచ్చింది. అందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను అని జై హిందూ! జై తెలంగాణ! అంటూ ముగించారు
ఈ కార్యక్రమంలో చకిలం అనిల్ కుమార్ చందుపట్ల వెంకటేశ్వర రావు కరణం నాయకులు అందరూ పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >