Posted on 2026-03-14 20:33:11
ఉద్యోగ అవకాశాల కోసం ముందుకొచ్చిన GCR చారిటబుల్ ట్రస్ట్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో GCR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న పార్శి రాములు కళ్యాణ మండపం వద్ద భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్, బ్యాంకింగ్, ఫార్మసీ, మార్కెటింగ్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సెస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు కామారెడ్డిలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన సంస్థల ప్రతినిధులు కూడా హాజరై యువతకు అవకాశాలు కల్పించనున్నారని చెప్పారు. మొత్తం 2000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ మేళాను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే GCR చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, రంగ రమేష్ గౌడ్, సబ్బాని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, రాశేఖర్, సునీల్, అరుణ్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >