Posted on 2026-03-10 19:26:04
విట్యాల హెచ్ఎం నిర్లక్ష్యంపై ఉగ్రరూపం దాల్చిన విద్యార్థులు!
హెచ్ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు
మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి, మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్ని పంపండి
డైలీ భారత్, రంగారెడ్డి: ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం "బడిబాట" అంటూ విద్యార్థులను బడికి రమ్మని పిలుస్తుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనవరి 26న కనిపించారు.. మళ్ళీ ఇప్పుడో
పాఠశాలకు హెడ్ మాస్టర్ (HM), పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. కానీ, ఆయన దర్శనం విద్యార్థులకు "అమావాస్య కో పున్నానికో" అన్నట్లుగా మారింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసేందుకు వచ్చిన సార్, మళ్ళీ ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించే వారు లేక వారి చదువులు "ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్న చందంగా మారాయి.
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం
మరో కొన్ని రోజుల్లో వార్షిక పరీక్షలు (SSC Exams) ఉన్న తరుణంలో, సిలబస్ పూర్తి చేయాల్సింది పోయి, "ఏదో పని ఉంది" అంటూ కాలక్షేపం చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. "ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా మా జీవితాలు ఆగమైపోతాయి, మా బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు?" అంటూ పదో తరగతి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అరకొరగా వచ్చి వెళ్లే సార్, కనీసం పాఠాలు చెప్పే తీరిక లేనంతగా ఏ పనుల్లో నిమగ్నమయ్యారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
ఎంఈఓ సమాధానంపై విస్మయం!
హెచ్ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ ఈ విషయంపై ఎంఈఓ (MEO) కి ఫోన్ చేయగా, "మీ ప్రిన్సిపాల్ కి వేరే పని ఉంది, 12వ తేదీ తర్వాత వస్తారు" అని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ప్రభుత్వ పాఠశాల అంటే విద్యార్థులకు విద్యను అందించడమా? లేక అధికారుల వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడమా? అని విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి, మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్ని పంపండి. మా చదువులను ఎందుకు ఆగం చేస్తున్నారు?"
విట్యాల పాఠశాల విద్యార్థుల ఆవేదన.
సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు తూట్లు!
ఒక్క విద్యార్థి ఉన్నా సరే పాఠశాలను నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తుంటే, ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ఉన్నా బోధించే టీచర్ లేకపోవడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, విధులకు గైర్హాజరవుతూ, విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న ఇలాంటి టీచర్లపై మరియు వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సదరు హెచ్ఎంను సస్పెండ్ చేయాలని విట్యాల గ్రామస్థులు మరియు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >
సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం
Posted On 2026-03-10 18:48:11
Readmore >
ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Posted On 2026-03-10 18:22:28
Readmore >