Posted on 2026-03-10 15:04:32
నీల నాగరాజు బీసి సంఘం జిల్లా అధ్యక్షులు..
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి 129 వర్ధంతి సందర్భంగా బీసి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలేని సామాజికంగా చదువుల తల్లిగా కొలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆమె ఒక విప్లవ నాయకురాలు సంఘసంస్కర్త.భారత దేశంలో మహిళా సాధికారత ప్రతిరూపం.
సావిత్రిబాయి పూలే విద్యారంగానికి మరియు సామాజిక న్యాయంగానికి చేసిన విశిష్ట సేవలకు విద్యామాతగా కీర్తించబడ్డారు.ఆమె తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి కఠినమైన సామాజిక నిబంధనలు మరియు పక్షపాతాలను ధిక్కరిస్తూ భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసింది. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే 1848 లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించింది.అది భారతదేశంలోని మహిళల విద్య కోసం ప్రారంభించిన సాహసోపేతమైన అడుగు అని అణిచివేతకు వ్యతిరేకంగా విద్యని విముక్తి సాధనంగా స్వీకరించాలని కోరుతూ అట్టడుగు వర్గాలను ప్రేరేపించడానికి ఆమె శక్తివంతమైన రచనలను,కవిత్వాలను రచించారు.
మహిళలకు విద్య నిషిద్ధమని భావించిన కాలంలో సావిత్రిబాయి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించడం ద్వారా వారి కోసం సమాజంలో విద్యా అందరి హక్కు అని తెలియపరిచారు. సామాజిక నిబంధనలను ధిక్కరించింది మరియు విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంది కానీ తన లక్ష్యంతో స్థిరంగా ముందుకు కదిలింది.
మీరు ఒక పురుషునికి విద్యానందిస్తే మీరు ఒక వ్యక్తికి విద్యను అందిస్తారు. కానీ మీరు ఒక స్త్రీకి విధ్యను అందిస్తే, ఒక కుటుంబాన్ని మరియు దేశాన్ని విద్యావంతులను చేస్తారు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్,ఎస్. దయాకర్,జబ్బార్ నాయక్,వినోద్ నాయక్,ప్రవీణ్,సురేష్,అర్చన,భార్గవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >