Posted on 2026-03-10 18:48:11
డైలీ భారత్, కామారెడ్డి: మాజీ జెడ్పిటిసి, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
"మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >