Posted on 2026-03-10 18:48:11
డైలీ భారత్, కామారెడ్డి: మాజీ జెడ్పిటిసి, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
"మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >