Posted on 2026-03-10 14:18:11
డైలీ భారత్, కామారెడ్డి: మాజీ జెడ్పిటిసి, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
"మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >