| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ

ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ

డైలీ భారత్, హైదరాబాద్: ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్‌ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్‌ రావుని పట్టుకున్నారు.

విద్యుత్‌ శాఖలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్‌ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్‌ రావును పట్టుకున్నారు.

కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చేయాలని లేదా 9440446106 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరారు.

Previous సిరిసిల్ల టూ అశ్వరావుపేటకు డీలక్స్ సర్వీస్..
Next పాఠశాల వాహనం బోల్తా.. విద్యార్థులకు గాయాలు
ADVERTISEMENT