Posted on 2026-02-24 17:50:25
డైలీ భారత్, హైదరాబాద్: ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్ రావుని పట్టుకున్నారు.
విద్యుత్ శాఖలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా మామిడి శ్రీనివాస్ రావును పట్టుకున్నారు.
కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరారు.
కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశము
Posted On 2026-02-24 17:11:45
Readmore >
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా... విజేతలను అభినందించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-02-24 12:41:45
Readmore >
రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-24 12:31:08
Readmore >
నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో ఆకస్మిక దాడులు : టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్.
Posted On 2026-02-24 12:23:24
Readmore >