Posted on 2026-02-24 03:35:06
25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకొని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు చెందిన 66 మంది సర్వేయర్లకు లైసెన్సులు గతంలో అందజేసిందని గుర్తు చేశారు. గత ఏడాది జిల్లాకు చెందిన సివిల్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 50 రోజుల పాటు శిక్షణ ప్రభుత్వం అందించిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో పాస్ అయిన 25 మందికి లైసెన్స్ పత్రాలను అందించామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. లైసెన్స్ పొందిన వారు అందరూ వారికి కేటాయించిన మండలాల్లో అందుబాటులో ఉండాలని, ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, నటరాజ్ సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశము
Posted On 2026-02-24 17:11:45
Readmore >
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా... విజేతలను అభినందించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-02-24 12:41:45
Readmore >
రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-24 12:31:08
Readmore >
నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో ఆకస్మిక దాడులు : టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్.
Posted On 2026-02-24 12:23:24
Readmore >