డైలీ భారత్, గట్టుప్పల్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షుడిగా బండారు వంశీకృష్ణను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన బండారు వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతినిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తానని అలాగే అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలపడానికి కృషి చేస్తానన్నారు తనను మండల శాఖ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.