Posted on 2026-02-17 19:41:40
బాల్య వివాహాల విముక్తి ప్రచార రతాన్ని ప్రారంభించిన టీ నాగరాణి
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తించాలని డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ టి నాగరాణి అన్నారు. మంగళవారం సాధన స్వచ్ఛంద సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఎల్ ఎస్ సి ఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్ని దిశ సెక్రటరీ టి నాగరాణి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నాయని వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని చెప్పారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే ముందు వారి తల్లిదండ్రులకు సమాజంపై అవగాహన కలిగించి బాల్య వివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను
వివరించినప్పుడే వాటిని అరికట్టవచ్చని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ సంస్థ చేపట్టిన ఈ కార్యక్ర మాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి మెంబెర్ స్వర్ణలత , డీసీపీవో స్రవంతి ,సాధన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ ప్రచార రథయాత్ర ముక్యంగా పాల్వంచ మండలం మాచారెడ్డి మండలం భిక్నూర్ మండలం సాధ శివ నగర్ మండలం లో ని గ్రామాలలో తిరుగుతుంది
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >