Posted on 2026-02-18 00:11:40
బాల్య వివాహాల విముక్తి ప్రచార రతాన్ని ప్రారంభించిన టీ నాగరాణి
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తించాలని డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ టి నాగరాణి అన్నారు. మంగళవారం సాధన స్వచ్ఛంద సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఎల్ ఎస్ సి ఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్ని దిశ సెక్రటరీ టి నాగరాణి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నాయని వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని చెప్పారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే ముందు వారి తల్లిదండ్రులకు సమాజంపై అవగాహన కలిగించి బాల్య వివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను
వివరించినప్పుడే వాటిని అరికట్టవచ్చని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ సంస్థ చేపట్టిన ఈ కార్యక్ర మాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి మెంబెర్ స్వర్ణలత , డీసీపీవో స్రవంతి ,సాధన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ ప్రచార రథయాత్ర ముక్యంగా పాల్వంచ మండలం మాచారెడ్డి మండలం భిక్నూర్ మండలం సాధ శివ నగర్ మండలం లో ని గ్రామాలలో తిరుగుతుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >