Posted on 2026-02-17 19:41:40
బాల్య వివాహాల విముక్తి ప్రచార రతాన్ని ప్రారంభించిన టీ నాగరాణి
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తించాలని డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ టి నాగరాణి అన్నారు. మంగళవారం సాధన స్వచ్ఛంద సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఎల్ ఎస్ సి ఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్ని దిశ సెక్రటరీ టి నాగరాణి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నాయని వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని చెప్పారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే ముందు వారి తల్లిదండ్రులకు సమాజంపై అవగాహన కలిగించి బాల్య వివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను
వివరించినప్పుడే వాటిని అరికట్టవచ్చని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ సంస్థ చేపట్టిన ఈ కార్యక్ర మాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి మెంబెర్ స్వర్ణలత , డీసీపీవో స్రవంతి ,సాధన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ ప్రచార రథయాత్ర ముక్యంగా పాల్వంచ మండలం మాచారెడ్డి మండలం భిక్నూర్ మండలం సాధ శివ నగర్ మండలం లో ని గ్రామాలలో తిరుగుతుంది
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >