Posted on 2026-08-07 14:59:52
మొరం టెండర్ల విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలి
మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి
డైలీ భారత్ కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ కి మరియు లోకల్ బాడీస్ అసిస్టెంట్ కలెక్టర్ వై వి గిరి కి మున్సిపల్ సమస్యల పైన వినతి పత్రం సమర్పించారు.
మునిసిపల్ లో జరుగుతున్న పరిణామాలు మున్సిపల్ మీటింగ్లు సక్రమంగా నిర్వహించడం లేదని
మున్సిపల్ వార్డుల్లో గత ఆరు నెలల నుండి చెత్తను సేకరించుటకు తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుచున్నందున కొత్త ఆటోలను కొనుగోలు చేయుటకు తమరి అనుమతి వెంటనే ఇవ్వగలరని కోరనైనది
మున్సిపల్ జెసిబి ని కామారెడ్డి పురపాలక సంఘ చైర్మన్ భర్త ఆధీనంలో ఉంచుకొని నడిపించడం జరుగుతుంది. కావున జెసిబి ని బాధ్యత గల మున్సిపల్ అధికారి ఆధీనంలో ఉండేటట్లు చూడగలరు.మున్సిపల్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ సిబ్బందిపై అజమాయిషీ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోగలరని కోరనైనది.
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ మంజూరు చేసిన మొరం టెండర్ల విషయంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై తగు చర్యలు తీసుకోగలరని కోరనైనది మునిసిపల్ అధికారుల మధ్య సమన్వయం లోపించినందున కామారెడ్డి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >