Posted on 2026-02-17 19:35:10
డైలీ భారత్, తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: ఈ రోజు (17.02.2026) వ తేదీన, గౌరవనీయులైన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్. ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో తిరుపతి పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో త్రాగి వాహనం నడిపిన వాహనదారులపై 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వాహనదారులపై 03 కేసులు నమోదు చేయడం జరిగింది.
వాహన తనిఖీలలో పట్టుబడిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలోని 10 మంది నిందితులకు 1వ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి వారు విచారణ అనంతరం ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మొత్తం రూ.1,00,000/- జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 03 మందికి ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున మొత్తం రూ.1,500/- జరిమానా విధించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలి, మద్యం సేవించి వాహనం నడపడం చట్ట రీత్యా నేరం.. మీప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది. ప్రజలు ఇది గమనించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించి సహకరించాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేసారు.
#AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #AndhraPradeshPolice #TirupatiPolice
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >