Posted on 2026-01-15 20:16:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని వినాయక నగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగురంగుల సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గాలిపటం ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ సంస్కృతికి పరిమితం కాకుండా, మన పండుగల ప్రాముఖ్యతను గుర్తించి సంస్కృతిని కాపాడాలని సూచించారు. వినాయక నగర్ వాసులు ఐక్యంగా పండుగను జరుపుకోవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. నగరాన్ని అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు నిలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 20:22:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 19:47:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 19:41:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 19:02:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 18:53:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 17:33:20
Readmore >