Posted on 2026-01-15 15:45:22
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు , బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో రుద్రూర్ సీఐ మార్గదర్శకత్వంలో వర్ని , కోటగిరి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని జలాల్పూర్, కోటయ్య క్యాంప్ , శ్రీనగర్ , నెహ్రూ నగర్ , హుమ్నాపూర్, జాకోరా గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలు జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందడంతో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా నిర్వహించబడుతోందని వర్ని ఎస్ఐ తెలిపారు. డ్రోన్ నిఘా ప్రారంభమైనప్పటి నుండి ప్రజల నుంచి మంచి సహకారం, సానుకూల స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చర్యలతో అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవారిలో భయం ఏర్పడిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, జూద కార్యకలాపాలు నిలిచిపోయినట్లు గుర్తించబడిందన్నారు. అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుంది. ప్రజలు ఎవరైనా కోడి పందాలు , జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయవచ్చు లేదా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని ప్రజలని కోరారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >