Posted on 2026-01-11 16:59:48
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచ రెడ్డి శ్రీకాంత్ ను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవం కార్యక్రమంలో అయినను ఘనంగా సన్మానించారు. మాజీ మేయర్ సంజయ్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అధ్యక్షతన జరిగిన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన మహోత్సవం వేదికగా ఇటీవల జరిగిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ పంచరెడ్డి శ్రీకాంత్ ను మున్నూరు కాపు సంఘం ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాహెర్ బిన్ హం దన్, ఆకుల లలిత,ధర్మపురి సురేందర్ తదితరులు సన్మానించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >