Posted on 2026-01-09 16:40:03
తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మొదటగా పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా 132 ప్రత్యర్థి టీం అయిన ప్రెస్ టార్గెట్ విధించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో ప్రెస్ లెవెన్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే చేసింది. పోలీస్ లెవెన్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోలీస్ లెవెన్ జట్టులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బౌలింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 3 ఓవర్లలో మూడు వికెట్లు తీసి పోలీస్ జట్టు విజయానికి దోహదపడ్డారు. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ బ్యాట్స్మెన్, ఉత్తమ బౌలర్ కు బహుమానం అందించారు. పోలీస్ జట్టులో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఎస్సై కిరణ్ కుమార్ బెస్ట్ బ్యాట్ మేన్ గా బహుమతి అందుకున్నారు. ప్రెస్ లెవెన్ నుండి ఉత్తమ బౌలర్గా శ్యామ్ నిలిచారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు నిత్యం పోలీస్, ప్రెస్ వారు తమ తమ విధుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతుంటారని ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రెస్ అండ్ పోలీస్ మిత్రులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ బసవరెడ్డి, ఏసిపి రాజా వెంకటరెడ్డి సిఐలు ఎస్సైలు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >