Posted on 2026-07-26 14:47:28
డైలీ భారత్, సిరిసిల్ల: దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ యుద్ధ వీరుల స్మరణార్థం సిరిసిల్లలో కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద ఉన్న వైజయంతి యుద్ధ ట్యాంకర్ వద్ద నివాళుల కార్యక్రమం జరిగింది. 1999 కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన 527 మంది అమర జవాన్లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మాజీ భారత సైనికులకు చిరు సన్మానం చేశారు. వారి త్యాగం, సాహసం, దేశభక్తి మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ఆడపు రవీందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేష్, శీలం రాజు, నవీన్ యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్ లతో పాటు మాజీ సైనికులు, పుర ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >