డైలీ భారత్, కామారెడ్డి: భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్గా నాయని మహిపాల్ యాదవ్ ని నియమించినట్లు కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ పట్ల నిబద్ధత, సేవా దృక్పథం, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే తత్వాన్ని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా కన్వీనర్గా నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి పైడి ఎల్లారెడ్డి అలాగే బాణాల లక్ష్మరెడ్డి కి పార్టీ జిల్లా,రాష్ట్ర నాయకులకు కార్యకర్తలకు మహిపాల్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు