| Daily భారత్
Logo




ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

News

Posted on 2026-07-26 17:19:21

Share: Share


ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

20 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థత

డైలీ భారత్, పోలవరం: చింతూరు పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని వి.ఆర్.పురం మండలం సోములగూడం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 20 మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, శనివారం అర్థరాత్రి నుంచి విద్యార్థినులకు అస్వస్థత ప్రారంభమైంది. అయితే తొలుత పాఠశాల ప్రాంగణంలోనే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరిగా మరింత మంది విద్యార్థినులకు విరోచనాలు రావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అస్వస్థతకు గురైన వారిలో 8 మంది విద్యార్థినులను 108 అంబులెన్స్‌ల ద్వారా వి.ఆర్.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, 11 మంది విద్యార్థినులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌక్వాల్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఎలా సంభవించింది? ఆహారంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఫుడ్ పాయిజన్‌కు గల అసలు కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >