కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని గొడ్డలితో దారుణ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం మోటాట్పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఎర్రరాజు(32) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. అసలు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది.