| Daily భారత్
Logo




ప్రచార మైకుల నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది

News

Posted on 2025-12-16 09:08:21

Share: Share


ప్రచార మైకుల నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:తెలంగాణ పల్లెల్లో గత కొన్ని రోజులుగా మారుమోగిన ప్రచార హెూరు ముగిసింది. మైకుల శబ్దాలతో, జెండాల ఊపులతో రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగిన ఎన్నికల సందడి ఒక్కసారిగా ఆగిపోయింది. నిన్నటి వరకు జనసందోహంతో ఉప్పొంగిన వీధులు నేడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది. గ్రామాల్లో గడప గడపకు వెళ్లి తమ విధివిధానాలు వివరించి, హామీలతో ఆకట్టుకున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రజా తీర్పు కోసం సిద్దమయ్యారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో 

7 మండలాల పరిధిలోని అనేక గ్రామ పంచాయతీలలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన సర్పంచ్  పోరులో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల పార్టీల బలం మాత్రమే కాదు,అభ్యర్థుల గుణగణాలు, ప్రజలతో వారి అనుబంధం కూడా కీలకంగా మారనుంది. 

ఇంతకాలం సర్పంచ్ ఎన్నికల హడావుడితో గడిచిన పల్లెలు ఇప్పుడు శాంతంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రజల మనసుల్లో మాత్రం కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయోనని గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరాలని  మాటలు కాదు పనులే కావాలని గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. 

గత రెండు విడత ల్లో జరిగిన ఎన్నికలు పార్టీల స్థితిగతులు, అభ్యర్థుల కార్యాచరణ, ప్రజల మద్దతు ఈ మూడు కలిసి ఫలితాలను ఎలా మలిచాయో స్పష్టంగా చూపించాయి. మరి మూడో విడత ఎన్నికలు పాలనలో ఏ విధమైన మార్పు దిశగా మారుతాయో వేచి చూద్దాం

Image 1

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం

Posted On 2026-04-17 10:15:59

Readmore >
Image 1

తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!

Posted On 2026-04-17 10:12:49

Readmore >
Image 1

బిక్కవోలులో మహిమాన్విత గణపతి

Posted On 2026-04-17 10:07:37

Readmore >
Image 1

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-17 08:50:45

Readmore >
Image 1

అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:40:22

Readmore >
Image 1

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:35:45

Readmore >
Image 1

మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2026-04-17 08:16:17

Readmore >
Image 1

ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్

Posted On 2026-04-17 08:15:29

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ..

Posted On 2026-04-17 07:41:26

Readmore >
Image 1

హత్య కేసు ఛేదించిన పోలీసులు...

Posted On 2026-04-17 07:29:32

Readmore >