| Daily భారత్
Logo




డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

News

Posted on 2025-12-16 11:22:24

Share: Share


డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో బయటపడ్డ విషయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవ మాసాలు కడుపులో మోసిన ఆ తల్లి రెండు నెలల బాబును మధ్యవర్తుల ద్వారా ఓ వ్యక్తికి విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీనివాస్, లక్ష్మీల దంపతుల రెండు నెలల పసికందు ఈ నెల ఐదున ఇంట్లో కనిపించకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 5న మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ రెండు నెలల బాలుడి తల్లి డబ్బుల కోసం ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పూనే కు చెందిన విశాల్ అనే వ్యక్తికి రెండున్నర లక్షలకు బాలుడిని విక్రయించడానికి ఒప్పుకున్నట్లు పోలీసుల కథనం ద్వారా తెలుస్తుంది. నిజామాబాద్ కు చెందిన రమాదేవి, మంజుల హైదరాబాద్కు చెందిన విట్టల్ ముగ్గురు కలిసి  లు ఈ ముగ్గురు కలిసి తల్లి లక్ష్మి తో సహా హైదరాబాద్ శివారులో పూణే కు చెందిన విశాల్ కు అప్పచెప్పడానికి ఈ నెల 9న వెళ్లి రెండున్నర లక్షలు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసులకు సోమవారం నిందితులు దొరకగా తల్లి లక్ష్మిని కోర్టులో హాజరు పరిచినట్లు మిగతా నలుగురు పై కూడా కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై వివరించారు. అయితే పిల్లలు పుట్టడం లేదని పిల్లలు లేరని ఈరోజుల్లో భార్యాభర్తలు  దూరమవుతున్న నేపథ్యంలో కన్నతల్లి ఇలాంటి ఘటన చేయడం బాధాకరం.

Image 1

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం

Posted On 2026-04-17 10:15:59

Readmore >
Image 1

తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!

Posted On 2026-04-17 10:12:49

Readmore >
Image 1

బిక్కవోలులో మహిమాన్విత గణపతి

Posted On 2026-04-17 10:07:37

Readmore >
Image 1

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-17 08:50:45

Readmore >
Image 1

అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:40:22

Readmore >
Image 1

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:35:45

Readmore >
Image 1

మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2026-04-17 08:16:17

Readmore >
Image 1

ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్

Posted On 2026-04-17 08:15:29

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ..

Posted On 2026-04-17 07:41:26

Readmore >
Image 1

హత్య కేసు ఛేదించిన పోలీసులు...

Posted On 2026-04-17 07:29:32

Readmore >