డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికిచెందిన శ్రీనివాస్ అనే యువకుడు సేవ్ గర్ల్స్ నినాదంతో నిజామాబాద్ నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టారు. 1450 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరిన శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రూణ హత్యలు అరికట్టాలని, సేవ్ గర్ల్స్ పేరుతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలవడానికి ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ చేరుకోవడానికి 22 రోజులు పట్టిందన్నారు.
News
సేవ్ గర్ల్స్ నినాదంతో నిజామాబాద్ నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టిన యువకుడు