Posted on 2025-12-05 12:21:15
తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లోకి బడంగ్ పేట కార్పొరేషన్
పాలన సౌలభ్యం కోసం మాత్రమే పాత జోన్ల పరిధిలోకి
ప్రజల అభిష్టానం మేరకే ప్రజాపాలన కొనసాగుతుంది
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్ న్యూస్, రంగరెడ్డి జిల్లా : జిహెచ్ఎంసిలో విలీనం చేసిన శివారు మున్సిపాలిటీలకు కొత్త జోన్లు ఏర్పాటు చేసే వరకు పాత జోన్లల్లో కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ ను తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లో విలీనం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
పాలన సౌలభ్యం కోసమే 27 పురపాలికలను అందుబాటులో ఉన్న సర్కిల్స్, జోన్ల పరిధిలోకి తెచ్చామని లక్ష్మారెడ్డి అన్నారు.
బడంగ్ పేట కార్పొరేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త జోన్ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు బడంగ్ పేట కార్పొరేషన్ విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. ప్రజల అభిష్టం మేరకు తప్పకుండా బడంగ్ పేట కార్పొరేషన్ ను ఛార్మినార్ జోన్ నుంచి మార్చుతామని... త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జోన్ లోకి వస్తుందన్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ నాయకులకు జోన్లు, సర్కిల్స్, విలీన ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >